Загрузка...

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు అన్ని — ప్రభుత్వ ప్రేరేపిత హత్యలే.!DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్

*ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు అన్ని — ప్రభుత్వ ప్రేరేపిత హత్యలే....!*

* *DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్....🔥*

* *నర్సంపేట శంకర్ గౌడ్ కుటుంబానికి 2 కోట్ల ఎక్స్ట్రేషియా ఇవ్వాలి*

రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న మొండి వైఖరిపై DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ మరణాలకు పాలకులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

*శంకర్ గౌడ్ గారిది ఆత్మహత్య కాదు.. హత్యే*

"ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ ప్రేరేపిత హత్యలే. కార్మికుల పొట్టకొడుతూ, వారిని మానసిక వేదనకు గురిచేస్తూ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది." అని అన్నారు

"మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 2 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి." అని డిమాండ్ చేశారు

*ఇందిరమ్మ రాజ్యమా? ఇబ్బందుల రాజ్యమా?:*✓

"ఇందిరా గాంధీ గారు ఈరోజు బతికి ఉంటే, పేదలను మరియు కార్మికులను ఇంతలా హింసించే పాలనను చూసి అస్సలు ఒప్పుకునేవారు కాదు. ప్రజా పాలన అని పేరు పెట్టుకుని, ప్రజలను నిలువునా ఇబ్బంది పెడుతున్నారు." అని ఎద్దేవా చేశారు

*"ప్రజాస్వామ్యంలో కార్మికుల హక్కులను కాలరాయడం దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే DSFI రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదు."*

Видео ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు అన్ని — ప్రభుత్వ ప్రేరేపిత హత్యలే.!DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ канала Ck News
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять