Загрузка...

#BCC NEWSజిల్లాలో 15,80,275 మంది ఓటర్లు ఉన్నారు : జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్*

భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో వేగవంతంగా క్లెయిమ్ ల పరిష్కారం*
*ఈ తేది నాటికి జిల్లాలో 15,80,275 మంది ఓటర్లు ఉన్నారు : జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్*

చిత్తూరు, ఈ రోజు వరకు జిల్లాలో 15,80,275 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి మీటింగ్ హాల్ నందు జిల్లాలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుండి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించ వచ్చునని తెలిపారు.
జిల్లాలో పోలింగ్ స్టేషన్ ల పరిధిలో బిఎల్ ఓ లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ బిఎల్ఏ ద్వారా పరిశీలించవచ్చునని తెలిపారు. దీనితో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన బోగస్, మరణించిన వారి వివరాలను బిఎల్ఓ లకు తెలిపి ఓటరు జాబితా నుండి తొలగించే కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సంబంధిత బిఎల్వోలు 70% మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ తేదీ నాటికి జిల్లాలో 7 నియోజకవర్గంలో కలిపి 15,80,275 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 18 సంవత్సరాల వయసు పూర్తి చేసి నూతనంగా ఓటరుగా నమోదు చేసే ప్రక్రియ సంతృప్తికరంగా కొనసాగుతున్నదన్నారు.
మొత్తం వచ్చిన ఫార్మ్స్ 40, 133 అన్ ప్రొసెస్డ్ 217, బి ఎల్ ఓ వద్ద పెండింగ్ లో ఉన్నవి 614, ఏ ఈ ఆర్ ఓ వద్ద పెండింగ్ ఉన్నవి 130, ఈ ఆర్ ఓ వద్ద 306, రిజెక్ట్ అయినవి 3,891, ఈ రోల్ ఇంక్లుషన్ 34960 ఇంకను పెండింగ్ లో 1,282 ఉన్నాయని పొలిటికల్ పార్టీ వారికి జిల్లా రెవెన్యూ అధికారి వివరించారు.

ఈ కార్యక్రమంలో కుప్పం ఆర్ డి ఓ విజయలక్షి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆమ్ ఆద్మీ పార్టీ, చిత్తూరు
కె.బాలసుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ, చిత్తూరు అట్లూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి, సీపీఐ(ఎం) పార్టీ, చిత్తూరు వాడ గంగరాజు, APCC కార్యదర్శి, భారత జాతీయ కాంగ్రెస్ చిత్తూరు పరదేశి, రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ, చిత్తూరు వి.సురేంద్ర కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిత్తూరు, ఉదయ్ కుమార్,
ఎలెక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Видео #BCC NEWSజిల్లాలో 15,80,275 మంది ఓటర్లు ఉన్నారు : జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్* канала BCC NEWS
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять